ఉల్లి రేటు లేని సమయంలో రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలివేస్తుంటారు. కానీ, ఇది చాల ప్రమాదకరమని వెటర్నరీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లో ఎర్రరక్తకణాలను విడదీస్తుంది. దీని వాళ్ళ పశువులలో బలహీనత, కళ్ళు, మూత్రం ఎర్రగా మారటం, శ్వాసలో వేగం పెరగటం, కడుపులో వాపు, చివరగా మరణించే ప్రమాదం ఉంటుందంటున్నారు.
నియంత్రణ & నివారణ:
1. పరిమిత మోతాదులో మేత ఇవ్వండి
-
ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5-10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండేలా చూసుకోవాలి.
అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలి. ఈ పరిమితికి మించితే పశువుల కళ్ళు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహరం తీసుకోవు
2. పౌష్టిక సహాయాలు
-
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సూచనలతో విటమిన్ ఇ, సెలీనియం, ఫోస్ఫరాస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్ లు, చరక లిక్విడ్ లాంటివి ఇవ్వాలి.
3. ఆహారం సరళీకరణ
-
మేత తర్వాత ఇతర ఘన ఆహారాలు మరియు హై-ప్రోటీన్ ఆహారాలు (పప్పులు, గడ్డి కషాయాలు) ఇచ్చి శక్తిని పెంచాలి.
4. వైద్య సూచనలు తీసుకోండి
-
పైన చెప్పబడిన ఏ లక్షణం కనపడిన వెంటనే వెటర్నరీ డాక్టర్ సంప్రదించాలి.
-
అవసరమైతే రక్తపరీక్షలు చేయించాలి.
No comments:
Post a Comment