వ్యవసాయ భూమి ఉండి, పాడి పశువుల పోషణతో కుటుంబాలను పోషించుకొంటున్న చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం "ఉచిత పశుగ్రాసం సాగు పథకం”ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద పశుగ్రాసం సాగు చేస్తే ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద 100% (వందశాతం) రాయితీ అందిస్తుంది. కనిష్ఠంగా 10 సెంట్లు, గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసాన్ని పెంచుకోవచ్చు. కనిష్ఠంగా రూ. 6,559, గరిష్ఠంగా రూ. 32,992 ప్రభుత్వ సాయంగా అందుతుంది.
👨🌾 అర్హతలు:
పశువులు, ఉపాధిహామీ పథకం జాబ్ కార్డు కలిగిన రైతులకు మాత్రమే ఉచిత పశుగ్రాసం సాగు పథకం వర్తిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న SC, ST, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. పశుగ్రాసం సాగుకు నీటి వసతి ఉన్న భూములను మాత్రమే ఎంపిక చేస్తారు.
🧾 ఎంపిక ప్రక్రియ:
-
రైతులు గ్రామ స్థాయిలో రైతుసేవ కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించి దరఖాస్తు చేయాలి.
రైతులు తమ దరఖాస్తుతో పాటు రేషన్కార్డు, ఆధార్కార్డు, పొలం 1బీ, జాబ్కార్డు, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్లను అందజేయాలి.
-
గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
-
ఎంపిక జరుగుతున్నప్పుడు నీటి వసతి, భూమి స్థాయితనం, ఇతర కారకాలు పరిశీలించబడతాయి.
🌿 ఉచిత పశుగ్రాసం సాగు పథకం ప్రోత్సాహకాలు:
--> 50 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 32,992 (కూలీల వేతనం రూ. 15,000, సామాగ్రికి రూ. 17,992)
--> 40 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 26,394 (కూలీల వేతనం రూ. 12,000, సామాగ్రికి రూ. 14,394)
--> 30 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 19,795 (కూలీల వేతనం రూ. 9,000, సామాగ్రికి రూ. 10,795)
--> 20 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 13,197 (కూలీల వేతనం రూ. 6,000, సామాగ్రికి రూ. 7,197)
--> 10 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 6,559 (కూలీల వేతనం రూ. 3,000, సామాగ్రికి రూ. 3,559) అందిస్తుంది.
No comments:
Post a Comment