చాలా మంది రైతులు యంత్రాలతో వరి కోసిన తరువాత పొలంలో మిగిలిన వరి కొయ్యలను తర్వాతి పంటకోసం తగులబెడుతుంటారు. అయితే, ఇలా పంట వ్యర్ధాలను విచక్షణారహితంగా కాల్చటం వల్ల పంటకు మేలు చేసే సూక్ష్మజీవులకు, మిత్ర పురుగులకు, వానపాములకు తీవ్ర నష్టం జరుగుతోంది. వ్యర్ధాలను తగులబెట్టడం వల్ల వెలువడే పొగ వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. దీనికి నిపుణులు కొన్ని ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారు అవి ఈ కింద తెలుసుకొందాం,
✅ఎందుకు పంట వ్యర్థాలను కాల్చకూడదు?
జీవ సూక్ష్మజీవుల నాశనం:
ఈ వ్యర్థాలను దహించడం ద్వారా పొలం లోని మంచి సూక్ష్మజీవులు మరియు మైక్రో ఆర్గానిజంలు చనిపోతాయి . ఇవి నేలను సమృద్ధిగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తాయి.
మిత్ర పురుగులకు హాని :
కొన్ని పురుగులు, కీటకాలు , ఇతర లాభదాయక జీవులు ఈ వ్యర్థాల్లో నివసించి, పంటలకు సహకరిస్తాయి. వాటిని వినాశనం చేయడం ద్వారా వాటిని కూడా కోల్పోతాము.
గాలి కాలుష్యం & వాతావరణ హానికరం:
పంట వ్యర్ధాలను దహించే ప్రక్రియలో పొగ విడుదల అవుతుంది; ఇది గాలి కాలుష్యం మరియు గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదలకి దోహదపడుతుంది.
No comments:
Post a Comment