LATEST UPDATES

Tuesday, October 14, 2025

ఉల్లిలో నారుకుళ్లు తెగులును ఎలా నివారించాలి?

        ఉల్లి (Onion) రైతులను నష్టపరిచే ప్రధాన తెగుళ్లలో నారుకుళ్లు తెగులు (Stem and Root Rot) ఒకటి. ఇది ప్రత్యేకంగా నారుమడి దశలో ఆశించి, ఒక్కోసారి 60% నుంచి 75% నష్టాన్ని కూడా కలిగిస్తుంది. పంట నారు దశలో ఈ తెగులు 'పైథియం' (Pythium) అనే  శిలీంద్రం (fungus) వల్ల వస్తుంది. ఇది నేలలో తేమ అధికంగా ఉన్నప్పుడు వ్యాపిస్తుంది. ఈ తెగులును నివారించటానికి విత్తన శుద్ధి చేయడంతో పాటు ఎత్తైన నారుమళ్లను రైతులు తయారు చేసుకోవాలి. నారుకుళ్లు తెగులు నివారకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ క్రింద తెలుసుకొందాం. 

తెగులు వ్యాప్తికి అనుకూలమైన పరిస్థితులు

  • నేలలో అధిక తేమ: వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా నారుమడికి నీరు ఎక్కువగా పెట్టినప్పుడు.

  • నీరు నిలవడం: నారుమడిలో నీరు సరిగా ఇంకిపోక నిలిచి ఉంటే.

  • సాంద్రత ఎక్కువ: నారుమడిలో విత్తనాలను దగ్గర దగ్గరగా వేయడం వల్ల గాలి ప్రసరణ తగ్గడం.

నారుకుళ్లు తెగులు నివారణకు సమగ్ర యాజమాన్యం

        నష్టాన్ని నివారించడానికి, విత్తనం నాటే ముందు నుండి నారు తీసే వరకు సరైన పద్ధతులు పాటించాలి.

A. యాజమాన్య పద్ధతులు (సాధారణ చిట్కాలు):

  1. నారుమడి తయారీ: తప్పనిసరిగా భూమి నుండి ఎత్తుగా ఉండే (Raised Beds) నారుమళ్లను తయారుచేసుకోవాలి. దీనివల్ల నీరు వేగంగా ఇంకిపోయి, వేర్ల చుట్టూ తేమ చేరకుండా ఉంటుంది.

  2. విత్తనం పలుచగా వేయడం: నారుమడిలో విత్తనాన్ని వరుసలలో, పలుచగా పోయాలి. దీనివల్ల మొక్కల మధ్య గాలి ప్రసరణ మెరుగుపడుతుంది.

  3. పంట మార్పిడి: ఒకే పొలంలో పదేపదే ఉల్లి నారును పెంచకూడదు.

  4. నేల శుద్ధి (Solarisation): వీలైతే, నారుమడిని ప్లాస్టిక్ షీట్లతో కప్పి సౌరీకరణ (Solarisation) చేయడం వల్ల శిలీంద్రాలు నశిస్తాయి.

B. విత్తన శుద్ధి (Seed Treatment):

విత్తనాలను నేలలో వేయడానికి ముందు శుద్ధి చేయడం అత్యంత ముఖ్యమైన తొలి చర్య.

  • రసాయన పద్ధతి: ప్రతి కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజమ్ (Carbendazim) లేదా థైరమ్ (Thiram) లేదా కాప్టాన్ (Captan) కలిపి విత్తన శుద్ధి చేయాలి.

  • జీవన పద్ధతి: కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా విరిడే (Trichoderma viride) అనే జీవ శిలీంద్రనాశకంతో శుద్ధి చేసి వాడుకోవచ్చు.

C. రసాయన నియంత్రణ (Chemical Control):

నారుమడిలో తెగులు లక్షణాలు కనిపించినట్లయితే, ఈ మందులలో ఏదో ఒకదానిని నీటిలో కలిపి మొక్కల మొదళ్ల వద్ద తడిసేలా (Drenching) పోయాలి.

  1. కాపర్ ఆక్సీక్లోరైడ్ (Copper Oxychloride): లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి మొదళ్లను తడపాలి.

  2. మెటలాక్సిల్ + మాంకోజెబ్ (Metalaxyl + Mancozeb): ఇది మార్కెట్‌లో సాఫ్ లేదా రిడోమిల్ ఎం.జెడ్ వంటి పేర్లతో లభిస్తుంది. దీనిని 2.5 నుండి 3 గ్రాముల చొప్పున లీటరు నీటికి కలిపి పోయాలి.

  3. బావిస్టిన్ (Bavistin) / కార్బండిజమ్: దీనిని 2 గ్రాములు లీటరు నీటికి కలిపి మొదళ్లలో పోయడం ద్వారా తెగులును అరికట్టవచ్చు.

ఈ సమగ్ర పద్ధతులను పాటించడం ద్వారా ఉల్లి నారుకుళ్లు తెగులును సమర్థవంతంగా నివారించి, అధిక దిగుబడి సాధించవచ్చు.

వంగ పంటలో చీడపీడల నివారణకు కీలక సూచనలు

        ఏడాది అంతా ఆదాయమిచ్చే పంట వంగ (Brinjal/Eggplant), అందుకే దీన్ని సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. వంగ పంటని నాటిన దగ్గర నుండి కోత వరకు అనేక రకాల తెగుళ్లు, పురుగులు ఆశిస్తాయి. ముఖ్యంగా మొవ్వు/కాయ తొలిచే పురుగు, వెర్రి తెగులు, పచ్చదోమ, పెంకుపురుగు, పేనుబంక, పిండినల్లి, రసంపీల్చే పురుగు, కొమ్మ, కాయకుళ్ళు తెగుళ్లు వంగ పంటను ఆశించి దిగుబడిని దెబ్బతీస్తాయి. 

కింద ముఖ్యమైన నివారణ మరియు నిర్వహణ చిట్కాలు ఉన్నాయి:

ముందస్తు జాగ్రత్తలు & ప్రాథమిక వ్యవహారాలు:

a) పంట మార్పిడి (Crop Rotation):

వంగను 2–3 సంవత్సరాల వరకు అదే ప్రాంతంలో సాగు చేయకుండా ఉండాలి. వేరే   తోటపంటలు లేదా పిండి పంటలతో మార్పిడి చేయడం ద్వారా తెగుల జీవ చక్రం బలహీనం అయ్యే అవకాశం ఉంటుంది.

b ) రోగనిరోదక వంగడాలు:

ముఖ్యంగా వంగలో గతంలో తరచూ తగిలిన తెగులున్నట్లయితే, రోగ నిరోధక వంగ రకాలను ఉపయోగించాలి.

c) మౌలిక శుభ్రత:

మొక్క వృద్ధి దశలో, పాత ఆకులను, చెడిన భాగాలను తొలగించి కాల్చేస్తే పాజిటివ్ ఫలితం వస్తుంది. పంట మధ్యలో గాలి చలనం ఉండే విధంగా నాటాలి.


మొవ్వు మరియు కాయ తొలిచే పురుగు (Shoot and Fruit Borer) నివారణ

ఈ పురుగు వంగ పంటకు అత్యధిక నష్టాన్ని కలిగిస్తుంది.
  • జీవ నియంత్రణ (Biological Control): పూత దశలో ఎకరాకు 5000 గుడ్లు ఉన్న ట్రైకోగ్రామా ఖిలోనిస్ (Trichogramma chilonis) కార్డులను ఆకుల అడుగు భాగంలో అమర్చడం ద్వారా పురుగు గుడ్లను నాశనం చేయవచ్చు.

  • సేంద్రీయ పద్ధతి: పూత సమయంలో వేప నూనె (Neem Oil) 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇది తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా నివారిస్తుంది.

  • రసాయన నియంత్రణ (Chemical Control): పురుగు ఉధృతి అధికంగా ఉంటే, కాయలు కోసిన తర్వాత ఈ క్రింది మందులలో ఏదో ఒకదానిని పిచికారీ చేయాలి:

    • స్పైనోసాడ్ (Spinosad) 0.3 మి.లీ. లేదా

    • క్లోరాంట్రనిలిప్రోల్ (Chlorantraniliprole) 0.3-0.4 మి.లీ. లేదా

    • ఇమామెక్టిన్ బెంజోయెట్ (Emamectin Benzoate) 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ముఖ్య సూచన: పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత కనీసం 3 నుండి 5 రోజుల వరకు కాయలను కోయకుండా ఉండటం సురక్షితం.

వెర్రి తెగులు (Little Leaf Disease) మరియు పచ్చదోమ (Leafhopper) నివారణ

        వెర్రి తెగులు అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది. దీన్ని పచ్చదోమ (Leafhopper) అనే కీటకం ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపింపజేస్తుంది. దీనికి నేరుగా మందు లేదు, దోమను నియంత్రించడం ఒక్కటే మార్గం.

  • లక్షణాలు: మొక్కలు గుబురుగా పెరిగి, చీపురు కట్టలా కనిపిస్తాయి. ఆకులు చిన్నగా మారి, పాలిపోయిన ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. పూత-కాత పూర్తిగా ఆగిపోతుంది.

  • నివారణ:

    1. వెర్రి తెగులు సోకిన మొక్కలను పొలం నుండి వెంటనే పీకి దూరంగా పడేసి నాశనం చేయాలి. వీటిని పొలంలో ఉంచితే పచ్చదోమ ద్వారా మిగతా మొక్కలకు వ్యాపిస్తుంది.

    2. తెగులును వ్యాప్తి చేసే పచ్చదోమ (Leafhopper) నివారణకు:

      • మిథైల్ డెమటాన్ (Methyl Demeton) 2 మి.లీ. లేదా

      • ఫిప్రానిల్ (Fipronil) 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

    3. నారుమడిలో నాటే ముందు, కార్బోఫ్యురాన్ 3G గుళికలను వేయడం ద్వారా పచ్చదోమ బెడదను తగ్గించవచ్చు.

రసం పీల్చే పురుగులు (Sucking Pests) నివారణ

(పేనుబంక, తెల్లదోమ, పెంకుపురుగు వంటివి)

  • లక్షణాలు: ఈ పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపురంగుకు మారి, పైకి ముడుచుకొని ఎండిపోతాయి.

  • నివారణ:

    • డైమిధోయేట్ (Dimethoate) లేదా మిధైల్డెమెటాన్ (Methyl Demeton) 2 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

    • తెల్లదోమ అధికంగా ఉన్నట్లయితే, ఎసిఫేట్ (Acephate) 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Friday, October 10, 2025

పశువుల మేతగా ఉల్లిపాయలతో డేంజర్:

        ఉల్లి రేటు లేని సమయంలో రైతులు ఆ పొలాలను గొర్రెలు, మేకలు, పశువులకు మేతగా వదిలివేస్తుంటారు. కానీ, ఇది చాల ప్రమాదకరమని వెటర్నరీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే N-propyl disulfide అనే రసాయనం పశువుల్లో ఎర్రరక్తకణాలను విడదీస్తుంది. దీని వాళ్ళ పశువులలో బలహీనత, కళ్లు, మూత్రం ఎర్రగా మారటం, శ్వాసలో వేగం పెరగటం, కడుపులో వాపు, చివరగా మరణించే ప్రమాదం ఉంటుందంటున్నారు. 

నియంత్రణ & నివారణ:

1. పరిమిత మోతాదులో మేత ఇవ్వండి

  • ఒక రోజులో పశువు తినే మొత్తం మేతలో 5-10 శాతానికి మించి ఉల్లిపాయలు ఉండేలా చూసుకోవాలి.

  • అది కూడా వారంలో 2-3 రోజులు మాత్రమే ఇవ్వాలి. ఈ పరిమితికి మించితే పశువుల కళ్ళు, మూత్రం ఎర్రగా మారిపోతాయి. ఆహరం తీసుకోవు

2. పౌష్టిక సహాయాలు

  • ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సూచనలతో విటమిన్ ఇ, సెలీనియం, ఫోస్ఫరాస్ ఇంజెక్షన్లు, లివర్ టానిక్ లు, చరక లిక్విడ్ లాంటివి ఇవ్వాలి. 

3. ఆహారం సరళీకరణ

  • మేత తర్వాత ఇతర ఘన ఆహారాలు మరియు హై-ప్రోటీన్ ఆహారాలు (పప్పులు, గడ్డి కషాయాలు) ఇచ్చి శక్తిని పెంచాలి.

4. వైద్య సూచనలు తీసుకోండి

  • పైన చెప్పబడిన ఏ లక్షణం కనపడిన వెంటనే వెటర్నరీ డాక్టర్ సంప్రదించాలి.

  • అవసరమైతే రక్తపరీక్షలు చేయించాలి.


ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకం

            కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి యోజన (PM Dhan-Dhaanya Krishi Yojana, PMDDKY) అనే పథకాన్ని ఆమోదించింది.

కింద ఈ కేంద్ర పథకం ముఖ్య వివరాలు తెలుసుకొందాం:

🎯 పథకం ఉద్దేశ్యం (Objectives)

  • వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం

  • పంట వైవిధ్యాన్ని (crop diversification) మరియు సుస్థిర (sustainable) వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం.

  • పంటల కోత తరువాత నిల్వ సదుపాయాలను (post-harvest storage) గ్రామ / బ్లాక్ స్థాయిలో మెరుగుపరచడం

  • సేద్యపు నీటి సౌకర్యాలను మెరుగుపరచడం

  • రైతులకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను సులభతరం చేయడం

  • రైతుల ఆదాయాలను మెరుగుపరుచడం, మార్కెట్‌లలో  సముచిత (fair) ధరలు అందించడం.

📅 కాలం & వ్యయం (Duration & Funding) 

  • ఈ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 6 సంవత్సరాల పాటు అమలు చేయనున్నది

  • ప్రతి సంవత్సరం ₹24,000 కోట్ల నిధులు కేటాయించనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం (Central Government Scheme) — అంటే ఆ ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

📍 జిల్లాల ఎంపిక (Districts & Selection)

  • దేశవ్యాప్తంగా 100 వ్యాపారంగా వ్యవసాయం లో వెనుకబడి  ఉన్న జిల్లాలు (low-performing agricultural districts) ఈ పథకం పరిధిలో ఉంటాయి.
  • ప్రతి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం నుండి కనీసం ఒక జిల్లా ఉండేలా ఎంపిక చేస్తారు.
  • ఈ జిల్లాలను ఎంపిక చేసే విధానం:

    1. తక్కువ ఉత్పాదకత (low productivity) 

    2. పంటల సాగు తీవ్రత తక్కువగా ఉండటం (low cropping intensity) 

    3. రుణ పంపిణీ పరంగా వ్యతిరేక పరిస్థితులు ఉండటం (credit access issues) 

🛠️ అమలు (Implementation)

  • 11 different Ministries & 36 existing కేంద్ర పథకాలను ఈ ప్రాజెక్టులో సమన్వయ పద్ధతిలో చేర్చబోతున్నారు.

  • జిల్లాకు చెందిన ధన్-ధాన్య సమితులు (Dhan-Dhaanya Committees) ఏర్పాటుచేస్తారు , అక్కడ ప్రాంతీయ వ్యవసాయ పరిస్థితులను బట్టి ప్రణాళికలు రూపొందిస్తారు.

  • ప్రగతిని ట్రాక్ చేయడానికి ఓ డిజిటల్ డాష్బోర్డు (digital dashboard) ఏర్పాటు చేస్తారు, 117 కీలక పనితీరు సూచికలతో (KPI) పర్యవేక్షణ జరుగుతుంది.

👩‍🌾 లాభం పొందేవారు & ప్రయోజనాలు (Beneficiaries & Benefits)

  • మొత్తం 1.7 కోట్ల (17 million) రైతులు దీని నుంచి లాభపడతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది.

  • రైతులు మంచి విత్తనాలు, ఎరువులు, ఆధునిక పద్ధతులు ఉపయోగించటం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చు.

  • నిల్వ (storage) సదుపాయాలు మెరుగవ్వడంతో పంటల నష్టం తగ్గుతుంది .

  • సేంద్రీయ, సుస్థిర పద్ధతుల్లో సాగు ప్రోత్సహించడం, పర్యావరణ స్నేహపూర్వక పద్ధతులు అమలులోకి తీసుకురావడం.

  • రైతులకు రుణ సదుపాయం, మరియు క్యాష్ ఫ్లో మెరుగుదల.

🤔 దరఖాస్తు విధానము (Application / Enrollment Process)

        ప్రచురించిన సమాచారం ప్రకారం, ప్రత్యక్ష దరఖాస్తు కార్యక్రమం గురించి ఇప్పుడే స్పష్టమైన మార్గదర్శకాలు ప్రకటించబడలేదు.

  • అధికారిక ప్రకటనలు ఈ పథకానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ల ద్వారా రావాల్సి ఉంటుంది.

  • గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిలో రైతు జాబితాలు ఇప్పటికే ఉంటే, ఆ జాబితాల ఆధారంగా ఎంపిక జరగవచ్చు.

  • రైతులు తమ వ్యవసాయ నుంచి సంబంధిత ఆధారాలు (భూమి వివరాలు, అభివృద్ధి కార్డులు, బ్యాంక్ ఖాతాలు) సిద్ధం చేసుకోవాలి.

  • కేంద్ర విధాన ప్రకారం, సమన్వయంగా ఉన్న పథకాలకూ (36 schemes) దరఖాస్తు విధానాలు ఉండగలవు.



Wednesday, October 8, 2025

పాడిపంట రైతులకు భరోసా: ఉచిత పశుగ్రాసం సాగు పథకం — అర్హతలు, ఎంపిక, ప్రోత్సాహకాలు

           వ్యవసాయ భూమి ఉండి, పాడి పశువుల పోషణతో కుటుంబాలను పోషించుకొంటున్న చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం "ఉచిత పశుగ్రాసం సాగు పథకంని అమల్లోకి తెచ్చింది. ఈ  పథకం కింద పశుగ్రాసం సాగు చేస్తే ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద 100% (వందశాతం) రాయితీ అందిస్తుంది. కనిష్ఠంగా 10 సెంట్లు, గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసాన్ని పెంచుకోవచ్చు. కనిష్ఠంగా రూ. 6,559, గరిష్ఠంగా రూ. 32,992 ప్రభుత్వ సాయంగా అందుతుంది.  

👨‍🌾 అర్హతలు:

            పశువులు, ఉపాధిహామీ పథకం జాబ్ కార్డు కలిగిన రైతులకు మాత్రమే ఉచిత పశుగ్రాసం సాగు పథకం వర్తిస్తుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న SC, ST, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులు. పశుగ్రాసం సాగుకు నీటి వసతి ఉన్న భూములను మాత్రమే ఎంపిక చేస్తారు.

🧾 ఎంపిక ప్రక్రియ: 

  • రైతులు గ్రామ స్థాయిలో రైతుసేవ కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించి దరఖాస్తు చేయాలి. 

  • రైతులు తమ దరఖాస్తుతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పొలం 1బీ, జాబ్‌కార్డు, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్‌లను అందజేయాలి.

  • గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.

  • ఎంపిక జరుగుతున్నప్పుడు నీటి వసతి, భూమి స్థాయితనం, ఇతర కారకాలు పరిశీలించబడతాయి.

🌿 ఉచిత పశుగ్రాసం సాగు పథకం ప్రోత్సాహకాలు:

--> 50 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 32,992 (కూలీల వేతనం రూ. 15,000, సామాగ్రికి రూ. 17,992)  

--> 40 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 26,394 (కూలీల వేతనం రూ. 12,000, సామాగ్రికి రూ. 14,394)  

--> 30 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 19,795 (కూలీల వేతనం రూ.   9,000, సామాగ్రికి రూ. 10,795)  

--> 20 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ. 13,197 (కూలీల వేతనం రూ.   6,000, సామాగ్రికి రూ.   7,197) 

--> 10 సెంట్లలో సాగుకు ప్రభుత్వం రూ.   6,559 (కూలీల వేతనం రూ.   3,000, సామాగ్రికి రూ.   3,559) అందిస్తుంది. 

Tuesday, October 7, 2025

🌸 కనకాంబరంలో ఎండు తెగులు (Dry Rot / Leaf Spot) — లక్షణాలు, కారణాలు & నియంత్రణ

        కనకాంబరంలో ఎండు తెగులు ముఖ్యమైన సమస్య. ఎండు తెగులు (Dry Rot / Leaf Spot) వ్యాధి ఎక్కువగా తేమ ఉన్న పరిస్థితుల్లో వస్తుంది. ఈ వ్యాధి ఫంగస్ వల్ల వస్తుంది మరియు ఆకులను ఎండబెట్టి పంట దిగుబడిని తగ్గిస్తుంది.

🌿 వ్యాధి లక్షణాలు (Symptoms):

        ఈ తెగులు ఆశించిన కనకాంబరం మొక్క ఆకులు వాలిపోయి, ఆకు అంచు పసుపు రంగుకు మారుతుంది. వేర్లు, కాండం, మొదలు కుళ్ళడం వాళ్ళ మొక్క అకస్మాత్తుగా ఎండిపోతుంది. దీంతో మొక్కలు గుంపులుగా చనిపోతాయి. 

🧴 నివారణ మార్గాలు (Control Measures):

1. సహజ (ఆర్గానిక్) నియంత్రణ

  • నిమ్మ / తులసి సారం కలిపిన ద్రావణాన్ని స్ప్రే చేయండి.

  • ట్రైకొడెర్మా హార్జియానం పౌడర్‌ను నేలలో కలపడం వ్యాధి నియంత్రిస్తుంది.

  • బాసిలస్ సబ్‌టిలిస్ వంటి సూక్ష్మ జీవకాలు ఫంగస్ వ్యాప్తిని అడ్డుకుంటాయి.

2. రసాయన నియంత్రణ

  • తెగులు ఆశించిన మొక్కల మోడళ్ళు తడిచేలా .. మాంకోజెబ్ 2.5 గ్రా / లీటర్ నీరు లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా / లీటర్ నీటితో స్ప్రే చేయండి. (ఒక్కో మొక్కకు 20-25 మిల్లీ లీటర్ల ద్రావణాన్ని పోయాలి).

  • 10–15 రోజులకు ఒకసారి పునరావృతం చేయండి.



🌾 ముగింపు

    కనకాంబరంలో ఎండు తెగులు వ్యాధిని సమయానికి గుర్తించి సరైన నియంత్రణ చర్యలు తీసుకుంటే, పంటను రక్షించవచ్చు. సహజ మరియు రసాయన నియంత్రణను సమన్వయం చేస్తే అధిక దిగుబడి సాధ్యమవుతుంది.


🌾సులభంగా విత్తనం నాటే 'హ్యాండ్ పుష్ సీడర్'


        రైతులు సాధారణంగా విత్తనాలు కూలీల సాయంతో చేతితో నాటేవారు. అయితే కూలీల కొరత, ఖర్చు పెరగడం వంటి సమస్యలతో వ్యవసాయంలో విత్తనాలు నాటడం ఒక కష్టమైన ప్రక్రియగా మారింది. ఈ సమస్యను అధిగమించటానికి సులభంగా విత్తనాలను నాటే యంత్రం అయినటువంటి 'హ్యాండ్ పుష్ సీడర్' అందుబాటులోకి వచ్చింది. దీని సహాయంతో ఒక మనిషి రోజుకు రెండు నుండి నాలుగు ఎకరాల వరకు విత్తనాలు నాటుకోవచ్చు. మొక్కకు మొక్కకు దూరం (Row Spacing) కోసం విత్తనం ఎంత దూరంలో కావాలంటే అంట దూరంలో పడేలా అడ్జెస్ట్ చేసుకొనే అవకాశం దీనిలో ఉంది. ప్రత్తి, కూరగాయలు, మొక్కజొన్న, ఆముదం సహా ఇతర విత్తనాలు నాటవచ్చు.

⚙️ హ్యాండ్ పుష్ సీడర్ వాడే విధానం:

  • నేలను ముందుగా తగిన విధంగా సంసిద్ధం చేయాలి.

  • విత్తనాన్ని సీడర్‌లో లోడ్ చేయాలి.

  • యంత్రాన్ని నెట్టడం ద్వారా విత్తనాలు సమానంగా నేలలో పడతాయి.

  • విత్తనాల రకం ఆధారంగా స్పేసింగ్ సర్దుబాటు చేయాలి.

🧰 నిర్వహణ సూచనలు:

        ఈ యంత్రంలో సాధారణంగా తక్కువ విడి భాగాలు ఉంటాయి; కాబట్టి తక్కువ కొనుగోలు ఖర్చు, మరమ్మత్తు చేయడం సులభం. నిర్వహణ (Maintenance) కూడా (ఆయిల్ చేయడం, భాగాల శుభ్రత) చాలా సులభం. 

💡 రైతులకు లాభాలు:

  • సమయం మరియు కూలీ ఖర్చు తగ్గింపు

  • సమానమైన మొలకలు

  • పంట ఉత్పాదకత పెరుగుతుంది

  • తక్కువ పెట్టుబడితో అధిక ఫలితాలు