Tuesday, April 22, 2025

LATEST UPDATES
>> కోళ్ళలో వైరస్ ల ప్రభావంతో వచ్చే వ్యాధులు! తీసుకోవాల్సిన జాగ్రత్తలు  >> కోళ్లలో వచ్చే పుల్లోరం వ్యాధి లక్షణాలు మరియు యాజమాన్యం  >> అల్లం సాగు విధానం, రకాలు, యాజమాన్య పద్ధతులు, ఎరువులు, మరియు సస్యరక్షణ  >> రబీలో 'కుసుమ' సాగు  >> రాగుల సాగులో మెళకువలు    

Saturday, October 1, 2022

పొద్దుతిరుగుడు లో చీడలు

తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల సాగు అంటే మొదట గుర్తొచ్చేది వేరుశనగ. ఆ తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట పొద్దుతిరుగుడు పంట. ఈ సాగులో ప్రధానంగా వచ్చే చీడపీడల నివారణ చర్యల గురించి తెలుసుకుందాం..!


శనగపచ్చ పురుగు:

పొద్దు తిరుగుడు పంటకు ముఖ్యంగా శనగపచ్చ పురుగు ఆశిస్తుంది. మొక్కలు పుష్పించే దశలో పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజలు, పువ్వులు, ఆకులు పైకి చేరి వాటిని తింటూ నష్టాన్ని కలుగజేస్తాయి. 

నివారణ:  

ఈ పురుగు నివారణకు ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు యొక్క ఉద్ధృతిని బట్టి ధయోడికార్బ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని సమూలంగా నిర్మూలించవచ్చు.

తెల్ల దోమ:

తెల్ల దోమ విషయానికొస్తే మొక్క రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది. మొక్క యొక్క 5 నుండి 6 ఆకుల దశ నుండి రసం పీల్చే కీటకాలు కనిపించే అవకాశం ఉంది.  

నివారణ: 

వీటి నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రా, 5 మి.లీ. వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్‌ 8 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా నాటిన 20-30 రోజుల వరకు రసంపీల్చే పురుగుల ఉద్ధృతిని తగ్గించుకోవచ్చు.

బూడిద తెగులు:

వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో బూడిద తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. బూడిద తెగులు ఆకులపైన, ఆకుల అడుగుభాగాన బూడిద వంటి పొడితో కప్పబడి ఉంటాయి.తెగులు ఉద్ధృతి ఎక్కువైతే ఆకులు పచ్చబడి రాలిపోతాయి.

నివారణ: 

దీని నివారణకు లీటరు నీటికి 3 గ్రాములు నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 1 మి.లీ, డైనోకాప్ లేదా 2 మి.లీ, హెక్సాకొనజోల్ కలిపి పిచికారి చేయాలి.

పొగాకు లద్దెపురుగు:

పైరు మొదటి దశలో ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయడం వల్ల ఉద్ధృతిని తగ్గించవచ్చు. 

నివారణ: 

పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న యెడల నొవాల్యూరాన్ 1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి లేక విషపు ఎరను 5 కి. తౌడు + 1/2 కిలో బెల్లం + 1/2 లీ. మోనోక్రోటోపాస్ లేక క్లోరిపైరిఫాస్ ఉండలుగా తయారుచేసి సాయంత్రం వేళల్లో పొలంలో అక్కడక్కడ వేయాలి.


తామర పురుగులు బిహారీ గొంగలిపురుగు మొక్క ఆకులను తిని అపారమైన నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి మొక్క మొదటి దశ నుంచి ఆశిస్తాయి. ఈ మొక్క లేత భాగాలను ఆశించి మొక్క ఎదగకుండా చేస్తాయి.

నెక్రోసిస్ తెగులు:

ఈ తెగులు తామర పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వ్యాప్తి చెందుతుంది. తెగులు సోకిన మొక్కల పువ్వులు విచ్చుకోకుండా మెలిక తిరిగి వంకరగా మారుతాయి.

నివారణ: 

వీటి నివారణలో పార్టీనియం కలుపును తీసివేయుట మరియు ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ లేదా థయోమిథాక్సామ్ 0.5 గ్రా. లీటరు నీటికి కలిపి రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే తెగులును అదుపులో ఉంచవచ్చు.

పచ్చ దీపపు పురుగు మాత్రం ఆకు అడుగు భాగంలో ఉండి ఆకు రసాన్ని పీల్చేస్తుంది. దీంతో ఆకులు ముడుచుకొని పసుపురంగులోకి మారతాయి.  

ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు:

ఆకుపై నల్లని గుండ్రని మచ్చలు ఏర్పడుతాయి. కాండంపై మరియు ఆకుతొడిమిపై పువ్వు క్రింది భాగాన గోధుమ వర్ణపు మచ్చలు లేక చారలు ఏర్పడుతాయి. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద మచ్చలుగా ఏర్పడి వ్యాధి సోకిన భాగాలు చనిపోతాయి. వ్యాధి తీవ్రంగా ఉ న్నప్పుడు ఆకులు రాలిపోవడం మరియు కాండం విరిగి పోవడం జరుగుతుంది. విత్తనాల ద్వారా ఈ శిలీంధ్రం వ్యాపించినప్పుడు విత్తనాలు కుళ్లుటం లేక మొలక ఎండుతెగులు లక్షణాలు కనిపిస్తాయి. బీజ దళాలపై మరియు వేరు భాగాలపై నల్లని మచ్చలు ఏర్పడడం వలన వేర్లు కుళ్లి మొలకలలో నానుడి తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఈ శిలింధ్రం. విత్తనాలు మరియు మొక్కల అవశేశాల్లో జీవిస్తుంది. ఈ తెగులు గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తేమతో కూడిన వేడి వాతావరణం’ ఈ వ్యాధి వృద్ధికి అనువైoది.

నివారణ: 

పంట అవశేషాలను శిలీంధ్రానికి అశ్రయమిచ్చే ఇతర కలుపుమొక్కలను నివారించాలి. కాప్టాన్ 3 గ్రా/1 కె.జి. విత్తనాలకి కలిపి విత్తన శుద్ధి చేయాలి.తెగులు గమనించిన వెంటనే మాంకోజిబ్ 0.25% మందు 2 సార్లు పిచికారీ చేయాలి.


NOTE: 

పొలంలో విత్తడానికి ముందే విత్తన శుద్ధి చేసే విధానం ద్వారా పురుగుల బెడద నుంచి కాపాడుకోవచ్చు.

No comments:

Post a Comment

@2020 All Rights Reserved. Designed by WWW.SMARTWAYTOSTUDY.COM !!!! Sitemap !!!! Seo Blogger Templates