తెలుగు రాష్ట్రాల్లో నూనె గింజల సాగు అంటే మొదట గుర్తొచ్చేది వేరుశనగ. ఆ తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట పొద్దుతిరుగుడు పంట. ఈ సాగులో ప్రధానంగా వచ్చే చీడపీడల నివారణ చర్యల గురించి తెలుసుకుందాం..!
శనగపచ్చ పురుగు:
పొద్దు తిరుగుడు పంటకు ముఖ్యంగా శనగపచ్చ పురుగు ఆశిస్తుంది. మొక్కలు పుష్పించే దశలో పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు లార్వాలు గింజలు, పువ్వులు, ఆకులు పైకి చేరి వాటిని తింటూ నష్టాన్ని కలుగజేస్తాయి.
నివారణ:
ఈ పురుగు నివారణకు ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. పురుగు యొక్క ఉద్ధృతిని బట్టి ధయోడికార్బ్ 1గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని సమూలంగా నిర్మూలించవచ్చు.
తెల్ల దోమ:
తెల్ల దోమ విషయానికొస్తే మొక్క రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది. మొక్క యొక్క 5 నుండి 6 ఆకుల దశ నుండి రసం పీల్చే కీటకాలు కనిపించే అవకాశం ఉంది.
నివారణ:
వీటి నివారణకు థయోమిథాక్సామ్ 0.5 గ్రా, 5 మి.లీ. వేప నూనెను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఇమిడాక్లోప్రిడ్ 8 గ్రా. కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా నాటిన 20-30 రోజుల వరకు రసంపీల్చే పురుగుల ఉద్ధృతిని తగ్గించుకోవచ్చు.
బూడిద తెగులు:
పొగాకు లద్దెపురుగు:
నెక్రోసిస్ తెగులు:
పచ్చ దీపపు పురుగు మాత్రం ఆకు అడుగు భాగంలో ఉండి ఆకు రసాన్ని పీల్చేస్తుంది. దీంతో ఆకులు ముడుచుకొని పసుపురంగులోకి మారతాయి.
ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు:
ఆకుపై నల్లని గుండ్రని మచ్చలు ఏర్పడుతాయి. కాండంపై మరియు ఆకుతొడిమిపై పువ్వు క్రింది భాగాన గోధుమ వర్ణపు మచ్చలు లేక చారలు ఏర్పడుతాయి. ఈ మచ్చలు ఒకదానితో ఒకటి కలిసి పెద్ద మచ్చలుగా ఏర్పడి వ్యాధి సోకిన భాగాలు చనిపోతాయి. వ్యాధి తీవ్రంగా ఉ న్నప్పుడు ఆకులు రాలిపోవడం మరియు కాండం విరిగి పోవడం జరుగుతుంది. విత్తనాల ద్వారా ఈ శిలీంధ్రం వ్యాపించినప్పుడు విత్తనాలు కుళ్లుటం లేక మొలక ఎండుతెగులు లక్షణాలు కనిపిస్తాయి. బీజ దళాలపై మరియు వేరు భాగాలపై నల్లని మచ్చలు ఏర్పడడం వలన వేర్లు కుళ్లి మొలకలలో నానుడి తెగులు లక్షణాలు కనిపిస్తాయి. ఈ శిలింధ్రం. విత్తనాలు మరియు మొక్కల అవశేశాల్లో జీవిస్తుంది. ఈ తెగులు గాలి ద్వారా ఒక మొక్క నుండి ఇంకో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తేమతో కూడిన వేడి వాతావరణం’ ఈ వ్యాధి వృద్ధికి అనువైoది.
నివారణ:
పంట అవశేషాలను శిలీంధ్రానికి అశ్రయమిచ్చే ఇతర కలుపుమొక్కలను నివారించాలి. కాప్టాన్ 3 గ్రా/1 కె.జి. విత్తనాలకి కలిపి విత్తన శుద్ధి చేయాలి.తెగులు గమనించిన వెంటనే మాంకోజిబ్ 0.25% మందు 2 సార్లు పిచికారీ చేయాలి.
NOTE:
పొలంలో విత్తడానికి ముందే విత్తన శుద్ధి చేసే విధానం ద్వారా పురుగుల బెడద నుంచి కాపాడుకోవచ్చు.
No comments:
Post a Comment