LATEST UPDATES
Showing posts with label వేప పిండి. Show all posts
Showing posts with label వేప పిండి. Show all posts

Sunday, October 5, 2025

నులిపురుగులతో కనకాంబరం పంటకు నష్టం



                నులిపురుగులు కనకాంబరం మొక్కల వేర్లలోకి రంద్రాలు చేసుకొని వెళ్లి వేర్లపై బొడిపెలను కలుగజేస్తాయి. దీని వల్ల ఆకు ముడుచుకొని ఊదా రంగుకు మారి మొక్కలు గిడసబారిపోతాయి. ఫలితంగా పూల పరిమాణం, దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగుల వల్ల ఎండు తెగులు సోకె ప్రమాదం ఉంది. నులిపురుగుల నివారణ కోసం ఎకరాకు 200 కిలోల వేప పిండి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. బంతి పూలతో పంట మార్పిడి చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.