నులిపురుగులు కనకాంబరం మొక్కల వేర్లలోకి రంద్రాలు చేసుకొని వెళ్లి వేర్లపై బొడిపెలను కలుగజేస్తాయి. దీని వల్ల ఆకు ముడుచుకొని ఊదా రంగుకు మారి మొక్కలు గిడసబారిపోతాయి. ఫలితంగా పూల పరిమాణం, దిగుబడి తగ్గుతుంది. ఈ పురుగుల వల్ల ఎండు తెగులు సోకె ప్రమాదం ఉంది. నులిపురుగుల నివారణ కోసం ఎకరాకు 200 కిలోల వేప పిండి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. బంతి పూలతో పంట మార్పిడి చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
LATEST UPDATES